పెళ్లి చేసుకో.. పెళ్లి కొడుకును దోచుకో.. ఒంటరి పురుషులే ఈ కిలాడీ టార్గెట్స్..!

పెళ్లి చేసుకో.. పెళ్లి కొడుకును దోచుకో.. ఒంటరి పురుషులే ఈ కిలాడీ టార్గెట్స్..!

 ఆమె నిత్య పెళ్లి కూతురు..! ఒంటరి పురుషులే లక్ష్యంగా తన బృందంతో కలిసి గాలం వేస్తుంది..! బుట్టలో పడిన వారిని పెళ్లి చేసుకుంటుంది..! వారి ఇంట్లో ఇల్లాలుగా అడుగుపెడుతుంది..! కలిసి కాపురం చేస్తుంది..! అవకాశం చిక్కగానే ఇంట్లోని నగదు, నగలు తీసుకుని ఉడాయిస్తుంది..! ఇలా ఒకరి తర్వాత ఒకరిని ఏకంగా ఆరుగురిని మోసం చేసింది..! తాజాగా ఏడో వ్యక్తిని మోసం చేసే ప్రయత్నంలో తన టీమ్‌తో సహా పోలీసులకు చిక్కింది..!

వివరాల్లోకి వెళ్తే.. పూనమ్‌, సంజనా గుప్తా, విమలేశ్‌ వర్మ, ధర్మేంద్ర ప్రజాపతి నలుగురూ ఒక ముఠాగా ఏర్పడ్డారు. వీరిలో పూనమ్‌ పెళ్లి కూతరులా, సంజనా ఆమెకు తల్లిలా వ్యవహరిస్తుంది. విమలేశ్‌, ధర్మేంద్ర ఒంటరి పురుషులు ఎక్కడ ఉన్నారా.. అని టార్గెట్స్‌ కోసం వెతుకుతారు. టార్గెట్‌ దొరకగానే అమ్మాయిని చూపిస్తామని, అందుకు రూ.1.5 లక్షలు ఫీజుగా చెల్లించాలని అంటారు.

అవతలి పార్టీ అందుకు ఒప్పుకోగానే పూనమ్‌, సంజనాల దగ్గరికి తీసుకెళ్తారు. వారు మాట్లాడుకున్న తర్వాత ఇద్దరికి పెళ్లి జరిపిస్తారు. అనంతరం పూనమ్‌ పెళ్లి కొడుకుతో అతని ఇంటికి వెళ్తుంది. అక్కడ అవకాశం చిక్కేదాక అతనితో కాపురం చేస్తుంది. అవకాశం చిక్కగానే ఆ ఇంట్లోని నగదు, నగలు తీసుకుని పరారవుతుంది. ఇదే క్రమంలో తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని బాందా జిల్లాకు చెందిన శంకర్‌ ఉపధ్యాయ్‌ అనే వ్యక్తిని ఈ ముఠా టార్గెట్‌ చేసింది.

విమలేష్‌, ధర్మేంద్ర అతనితో మాట్లాడి పూనమ్‌, సంజనాలతో మాట్లాడించారు. అయితే శంకర్‌ ఉపాధ్యాయ్‌కి వారు తీరుపై అనుమానం కలిగింది. దాంతో రూ.1.5 లక్షలకు ముట్టజెప్పేందుకు నిరాకరించాడు. దాంతో పూనమ్‌ ముఠా అతడిని బెదిరించింది. తప్పుడు కేసు పెట్టి జైల్లో వేయిస్తామని హెచ్చరించింది. దాంతో తనకు ఆలోచించుకోవడానికి సమయం కావాలని చెప్పి అతడు అక్కడి నుంచి బయటపడ్డాడు. తర్వాత పోలీసులను ఆశ్రయించాడు. బాందా పోలీసులు ఆ ముఠాను అరెస్ట్‌ చేసి కటకటాల వెనక్కి నెట్టారు.

Views: 0

About The Author

Tags:

Related Posts

Latest News

విద్యార్థులు శాస్త్రవేత్తలై సమాజానికి సేవలందించండి విద్యార్థులు శాస్త్రవేత్తలై సమాజానికి సేవలందించండి
శాతవాహన స్కూల్లో సివి రామన్ జయంతి వేడుకలు   అక్షర గెలుపు సిరిసిల్ల :శాస్త్రీయంగా ఆలోచించండి.. శాస్త్రవేత్తలై సమాజానికి సేవ చేయండి అంటూ కరస్పాండెంట్ వేణుగోపాల్ విద్యార్థులకు పిలుపునిచ్చారు....
తెలంగాణలోని పాఠశాలలో వాటర్ బెల్?
కరీంనగర్ రూలర్ మండల్ బహుదూర్ఖాన్పేట్ గ్రామంలో రెడ్డి సంఘం ఏకగ్రీవ ఎన్నికైన గుర్రమంజి రెడ్డి
ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు 
గుర్తింపు లేని మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీల మోసాల బారిన పడకండి
ఏఈ అమరేందర్ కు సన్మానం...
మైనింగ్ సూపర్వైజర్ల బదిలీలను నిలిపివేయాలి